ఎర్రబారుతోంది.. | - | Sakshi
Sakshi News home page

ఎర్రబారుతోంది..

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

–8లో u

అయిజ: తెల్లబంగారం ఎర్రబారుతోంది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఈ సారి రైతులు 1,72,572 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. అయితే పగలు ఎండ ఎక్కువగా ఉండటం.. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. దీనికి తోడు రసంపీల్చే పురుగులు, దోమలు (జాసీడ్స్‌) వంటి కీటకాలు దాడి చేయడంతో పంట మరింత వేగంగా దెబ్బతింటోంది. జిల్లాలోని అనేక శివార్లలో పత్తిపంట ఎర్రబారి కనిపిస్తోంది. మొదట ఆకులు పసుపు రంగులోకి మారి, తర్వాత గులాబీ ఎరుపు రంగును సంతరించుకుని రాలిపోతున్నాయి. కాయలు తెరుచుకుని తెల్లని పత్తి కనిపించిన్పటికీ.. ఆకులు రాలడం ద్వారా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే రైతులు దీన్ని ఎర్ర తెగులుగా భావిస్తున్నారు. భయపడి నీరు కడితే మొత్తం పంటకు వ్యాపిస్తుందని.. నీటి తడులు పెట్టడం ఆపేస్తున్నారు.

అలంపూర్‌ 2,090

ధరూరు 4.630

గద్వాల 14,200

గట్టు 14,408

అయిజ 21,525

ఇటిక్యాల 13,170

కేటీదొడ్డి 6,050

మల్దకల్‌ 27,488

మానవపాడు 21,485

రాజోళి 9,400

ఉండవెల్లి 10,244

వడ్డేపల్లి 19,075

ఎర్రవల్లి 8,807

అధిక ఉష్ణోగ్రతలతో

రంగు మారుతున్న తెల్లబంగారం

పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం

ఆందోళనలో పత్తి రైతులు

జిల్లావ్యాప్తంగా

1,72,572 ఎకరాల్లో సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement