మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తాహ భజనలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మండలంలోని బిజ్వారం, చర్లగార్లపాడు, ఆరగిద్ద, సంకాపురం, పారుచర్ల గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు భజనలో పాల్గొన్నారు. వారం రోజులపాటు నిరంతరంగా కొనసాగే ఈ సప్తాహా భజనలు మండలి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, సిబ్బంది పాల్గొన్నారు.


