ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి. లింగ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే ఐదు జిల్లాల్లోనూ మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉండగా, పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో మగశిశు జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా నమోదైంది. మొత్తంగా ఆడపిల్లల జననాల శాతం 2022తో పోలిస్తే 0.68 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
జోగుళాంబ గద్వాల
మగ, ఆడ శిశువుల వారీగా జనన గణాంకాలు..


