కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సంత వేలం నిర్వహించడం లేదు. చివరిసారి నిర్వహించిన వేలం పాటలో మున్సిపాలిటీకి రూ.3.36 కోట్ల ఆదాయం సమకూరింది. పురపాలిక నాలుగేళ్లుగా రూ.కోట్లలో ఆదాయం కోల్పోయింది.
– గణేష్, మేనేజర్, పెబ్బేరు పురపాలిక
శాశ్వత పరిష్కారం చూపిస్తాం..
పెబ్బేరు సంత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి అర్చకులతో శాంతియుత చర్చలు జరుపుతున్నారు. అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
– శ్రీనివాస్గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు
●


