ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు వాతావరణశాఖ హెచ్చరికలతో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లోలెవల్ వంతెనల వద్దకు వెళ్లొద్దు. పోలీసుశాఖ ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అత్యవసరమైతే 100కు కాల్ చేయండి. చేపల వేటకు వెళ్లొద్దు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. శిథిలావస్థ భవనాల్లో ఉండొద్దు. సెల్ఫీలు, రీల్స్ కోసం వరదల్లోకి వెళ్లవద్దు. పోలీసు, రెవెన్యూశాఖ సూచనలు పాటించాలి.
– సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వర్షాలతో నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో వరదలు వస్తున్నందున అన్నిశాఖలు సమస్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు.
– రాహుల్శర్మ, కలెక్టర్


