భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎంఓఏఐ ఆధ్వర్యంలో ఏరియా జీఎం కార్యాలయం ఎదుట చేపడుతున్న దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, బీఎంఎస్ నాయకులు, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఉద్యోగు ల సంఘం నాయకులు రాంబాబు, భిక్షమయ్య , భూక్యా మోహన్, హేమనాయక్, సికిందర్సింగ్ పా ల్గొని సంఘీభావం తెలిపారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.


