
పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా..
నా పేరు సమ్మక్క. నాకు పక్షవాతం వచ్చి ఒక కాలు, ఒక చేయి పడిపోయింది. నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ కోసమని గణపురంలో చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ సదరం సర్టిఫికెట్ కావాలన్నరు. జిల్లా ఆస్పత్రికి పోగా 65 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిర్రు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తు చేసిన. అయినా పింఛన్ రాకపోవడంతో కలెక్టరేట్కు వస్తున్నా. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడుసార్లు దరఖాస్తు ఇచ్చిన. అయినా పింఛన్ మంజూరు కాలేదు. నాకు భూమి జాగా లేదు. ఆస్పత్రిలో చూయించుకోవడం, ఇంటి ఖర్చులకు ఇబ్బంది అయితాంది.
– చివిటిబోయిన సమ్మక్క, చెల్పూరు, గణపురం