ఎన్నో ఏళ్ల నుంచి వీబీజీ రామ్జీ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే పే స్కేల్ వర్తింపజేయాలి. మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలి. సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి. అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలి. వేతనాలు పెంచాలి. ఏడు రోజుల నుంచి ఆఫీసు విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతున్నాం. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు.
–రాజ కరుణ, ఏపీఓ, జఫర్గఢ్


