నర్మెట శివారు మరియాపురంలో మిర్చితోటకు నీరుపారిస్తున్న వృద్ధ రైతు కిష్టయ్య
రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు పోయి పుష్యమి వచ్చినా వర్షాలు కురువకపోవడంతో రైతన్న మబ్బుల వంక ఆశగా చూస్తున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు పెట్టడంతో పాటు మిర్చి, వరి నార్లు పోశారు. తీరా వరణుడు ముఖం చాటేసి..నడి వేసవిని తలపించేలా భానుడు భగభగలాడుతుండడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. బావులు, బోరు బావులు కలిగిన రైతులు వరినారును, పత్తి, మిర్చి మొలకలను దక్కించుకునే ప్రయత్నంలో వరుస తడులుగా నీరందిస్తూ కరుణించు వానదేవుడా అని వేడుకుంటున్నారు.
– నర్మెట


