అదనపు కలెక్టర్ పింకేష్కుమార్
జనగామ: ట్రేడ్ లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపారస్తులు బిజినెస్ నిర్వహించాలని అదన పు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. గురువారం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మహేంద్ర షోరూంకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తదితర నిబంధనల వివరాలు సేకరించారు. ఓ షోరూం కొలతలను లెక్కించి ఫీజుకు సంబంధించి ఫైనల్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కాలపరిమితి ముగిసిన వాణిజ్య లైసెన్స్లను వెంటనే పునరుద్ధరించు కోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో నివాసానికి అనుకూలంగా లేని, శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించా లని పేర్కొన్నారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయవాదుల నిరసన
జనగామ రూరల్: పహల్గాం ఘటనకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండెబోయిన హరిప్రసాద్యాదవ్ ఆధ్వర్యాన గురువారం న్యాయవాదులు నిధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చౌరస్తాలో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్లో శాంతి వాతావరణం ఏర్పడి అభివృద్ధి చెందుతుంటే టెర్రరిస్టులు కేవలం హిందువుల ను టార్గెట్ చేసి అతి కిరాతకంగా కాల్చిచంపడం దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యలను కేంద్రం తుదముట్టించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ప్రసాద్రావు, సుదీరంజన్, రాంగోపాల్, శ్రీరాం శ్రీనివాస్, ఇంగి అశోక్, రామకృష్ణ, సునీతరాణి, ఉపేంద ర్, చందు, గాజుల రవీందర్ పాల్గొన్నారు.
టెక్స్టైల్ టెక్నాలజీలో
డిప్లొమా కోర్సులు..
జనగామ రూరల్: హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి పి.చౌడేశ్వరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ సబ్జెక్టుగా పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, వయసు 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలు 15–25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు రెండో సంవత్సరంలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ, ఫస్ట్ ఫ్లోర్, రైట్ వింగ్, పీఎస్ఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్– 500004 చిరునామాకు పోస్టు ద్వారా మే 15వ తేదీ లోగా చేరేలా పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు హిమజాకుమార్ను 9030079242 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
సాహితీ యాత్రకు ఘనస్వాగతం
జనగామ రూరల్: తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి క్షేత్రాన్ని, పోతన జన్మస్థలమైన బొమ్మెర గ్రామాన్ని సందర్శించేందుకు పాలమూరు నుంచి పాలకుర్తి వెళ్తున్న 24 మంది సాహితీమూర్తులు, పండితులు, కవులు, రచయితలకు కలెక్టరేట్ వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యాన కవులు కళాకారులుగురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాహితీ యాత్రలో పాల్గొన్న పలువురు కవులు మాట్లాడుతూ గొప్ప కవులు జన్మించిన నేల.. చైతన్య పురిటిగడ్డ జనగామ అని పేర్కొన్నారు. ఈ యాత్రలో సాహితీవేత్త, కవి డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, తెలుగు భాషా ఉపాధ్యాయుడు పల్లెర్ల రామ్మోహనరావు, కవులు సిద్ధాంతి రాజశేఖరశర్మ, బలరాంగౌడ్, గిరిజారమణ, అనితకుమారి, నీరజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ట్రేడ్ లైసెన్స్ పొందాకే వ్యాపారం చేయాలి
ట్రేడ్ లైసెన్స్ పొందాకే వ్యాపారం చేయాలి