
మాట్లాడుతున్న విజయలక్ష్మి
దేవరుప్పుల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని ఐసీడీఎస్ ఏసీడీపీఓ జి.విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కడవెండి దొడ్డి కొమురయ్య స్మారక భవన్లోని కుట్టుశిక్షణ కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యాన హైస్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
సర్పంచ్ బెత్లీనా, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి, హెచ్ఎంలు వెంకన్న, బాలు, ఎస్ఎంసీ చైర్మన్ వీరాచారీ, కిరణ్కుమార్రెడ్డి, చైల్డ్లైన్ ప్రతినిధి పద్మ, సఖి కౌన్సిలర్ రాధిక, అంగన్వాడీ టీచర్లు రహమత్బేగం, విజయకుమారి, కోమలత, అరుణ పాల్గొన్నారు.