జగిత్యాల: బీసీ మహిళలకు ఆర్థిక సాధికారత సాఽ దించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టైలరింగ్లో నైపుణ్యం కలిగిన వారికి ఇందిరమ్మ పథకం పేరుతో ఆటోమెటిక్ కుట్టుమిషన్లు అందించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే టైలరింగ్లో శిక్షణ పొంది నైపుణ్యం ఉన్న వారికి ఇది ప్రయోజనం. వందశాతం సబ్సిడీతో ఇందిరమ్మ కుట్టుమిషన్లు అందించనున్నారు.
నియోజకవర్గానికి వెయ్యి
ముందుగా నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలు న్నాయి. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న లబ్ధి దారులకు ఆటో మెటిక్ మిషన్లు అందించనున్నారు.
ఉపాధి అవకాశాలు
కుట్టుమిషన్ల ద్వారా బీసీలు ఉపాధి పొందే అవకా శం ఉంది. వందశాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే వ్యాపారాలు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చాలామంది మెప్మా, సెర్ప్ ద్వారా కుట్టుమిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమెటిక్ మిషన్ల ద్వారా కొంత పని తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మహిళలకు మేలు కలుగుతుంది.
అర్హతలు
మండలస్థాయి కమిటీల ఏర్పాటు
నియోజకవర్గానికి వెయ్యి చొప్పున
బీసీ మహిళలకు ఉపాధి
వచ్చేనెల 13 చివరి తేదీ


