జగిత్యాలరూరల్: సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా కార్డు కలిగిన వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు గ్యాస్ ఏజెన్సీలు పట్టణ, గ్రామీణప్రాంతాల వినియోగదారులతో ఈకేవైసీ చేస్తున్నాయి. ఈనెల 16లోగా తప్పనిసరిగా ఈ–కేవైసీ చేసుకోవాలని చెబుతున్నాయి. గడువు దాటితే సిలిండర్లు రావంటున్నాయి. ఏజెన్సీల వద్ద, యాప్లద్వారా మొబైల్లో లేదా ఇంట్లోనే బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ–కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 18 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఉజ్వల కనెక్షన్లు 52వేలు, దీపంపథకం 50వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 70 శాతం కార్డుదారులు మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. మిగతావారు గ్యాస్ రావాలంటే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది.
ఈ–కేవైసీ ఇలా
తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రతి వ్యక్తి ఈ–కేవైసీ చేయించాల్సిందే. గ్యాస్ కనెక్షన్లు పక్కదారి పట్టకుండా చమురు కంపెనీలే ఈ–కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశాయి. ప్రతి డిస్ట్రిబ్యూటర్ తమ దగ్గరున్న కార్డుదారులకు గ్యాస్ సరఫరా కావాలంటే ఈ–కేవైసీ చేయించాల్సిందే.
– జితేందర్రెడ్డి,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు : 3.50 లక్షలు
డిస్ట్రిబ్యూటరీలు : 18
ఉజ్వల కనెక్షన్లు : 52 వేలు
దీపం పథకం కనెక్షన్లు : 50 వేలు


