
న్యూఢిల్లీ: భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి నెల కొల్పోందుకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వాదనకు దిగారు. గత నెలలో భారత్- పాక్ దేశాల మధ్య భీకరంగా జరగబోయే యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం లేదని, ఇది ప్రత్యక్ష సైనిక చర్చల ఫలితమని స్పష్టం చేసినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ మరోమారు ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు.
‘భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి లభించదు. సెర్బియా- కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రాదు. ఈజిప్ట్- ఇథియోపియా మధ్య శాంతిని నెలకొల్పినందుకు కూడా నోబెల్ శాంతి బహుమతి దక్కదు. మధ్యప్రాచ్యంలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదు’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక పోస్టులో పేర్కొన్నారు. అలాగే తాను రష్యా/ఉక్రెయిన్, ఇజ్రాయెల్/ఇరాన్తో సహా ఎక్కడ ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని, ఈ అంశాల్లో ఫలితాలు ఏమైనా కావచ్చు. ప్రజలకు అంతా తెలుసు. తనకు ఇదే ముఖ్యమని ట్రంప్ అన్నారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- రువాండా మధ్య వాషింగ్టన్లో శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధమైన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆఫ్రికాకు ఘనమైన దినం. నిజం చెప్పాలంటే, ప్రపంచానికే గొప్ప దినం. దీనికి కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా న్యూఢిల్లీ- ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలను అరికట్టడంలో అమెరికా పాత్రను భారతదేశం తిరస్కరిస్తూ వస్తోంది.
ఇది కూడా చదవండి: International Yoga Day: ఉత్సాహంగా జపాన్ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు