Terror Attacks In Waziristan: పాక్లో ఉగ్ర దాడులు.. 8 మంది సైనికుల మృతి
కరాచి: పాకిస్తాన్లోని ఉత్తర వజీరిస్తాన్లో రెండు ఉగ్రవాద దాడుల్లో ఎనిమిది మంది సైనికులు మరణించారు. గిరిజన జిల్లా దతఖేల్లో భద్రతా బలగాల వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు, రాకెట్ గన్లతో మెరుపు దాడి చేసి ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. జిల్లాలోని ఇషామ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కాల్పుల్లో మరో సైనికుడు చనిపోయాడు.
చదవండి: Russia-Ukraine war: మాస్క్వా మునిగింది