
పారిస్లో ఇద్దరి మృతి
పారిస్: యూరోపియన్ సాకర్ ఫైనల్లో శనివారం రాత్రి ఇంటర్ మిలన్పై పారిస్ సెయింట్ జెర్మయిన్ జట్టు విజయం అనంతరం ఫ్రాన్సులో జరిగిన ఉత్సవాలు హింసాత్మకంగా మారాయి. వాటిలో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోగా, ఒక పోలీసు అధికారి తీవ్ర గాయాలతో కోమాలోకి జారుకున్నారు. డాక్స్ నగర వీధుల్లో జరిగిన సంబరాల్లో 17 ఏళ్ల బాలుడు కత్తిపోట్లకు గురై మరణించాడు.
పారిస్లో విజయోత్సవాల ప్రాంతంలో కారు ఢీకొని ఓ స్కూటరిస్ట్ మృతి చెందాడు. కౌటన్స్ ప్రాంతంలో సాకర్ అభిమానులు పేల్చిన బాణసంచా తాకడంతో తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు అధికారి కోమాలోకి వెళ్లారు. వీటికి సంబంధించి 500 మందిపైగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పారిస్లో భారీగా పోలీసులను మోహరించారు.