రష్యా‌‌-ఉక్రెయిన్​ సంక్షోభం.. అనూహ్య పరిణామం దేనికి సంకేతం?

Russia Pulls Some Troops Back From Ukraine Border - Sakshi

Ukraine Border Crisis: ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు ఒక్కసారిగా వేడేక్కాయి. రేపు ఏం జరగబోతుందో అనే ఆందోళన ప్రపంచమంతా నెలకొంది. ఉక్రెయిన్​ ఆక్రమణలో భాగంగా బుధవారం రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు పక్కా సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్​ జెలన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. మరోవైపు అమెరికా సైతం ఇదే హెచ్చరికను జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. 

ఉక్రెయిన్​ సరిహద్దులోని కొన్ని రష్యన్​ దళాలు వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యలో భాగమా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్రిల్​ పూర్తైందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్​ పశ్చిమ భాగంలో లక్షకు పైగా సైన్యంతో మోహరించిన రష్యా.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని? బేస్​కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పించింది, ఎందుకు రప్పించింది అనే విషయాలపై రాత్రికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

జర్మనీ చర్చల నేపథ్యంలో? 
ఇదిలా ఉండగా.. దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా ఈ నిర్ణయం తీసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యాకు గత మూడు రోజులుగా ఈ వ్యవహారంలో జర్మనీ మెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్న​ సంగతి తెలిసిందే. జర్మన్​ ఛాన్స్​లర్​ ఒలప్​ స్కోల్జ్​ ఇవాళ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్​తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దళాల వెనక్కి నిర్ణయం తీసుకుందేమోనన్న వాదనా వినిపిస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్​ సరిహద్దు పరిణామాలు రష్యా చేష్టలతో వేడేక్కుతున్నాయి. ఒకవైపు రష్యా బలగాల మోహరింపు చేస్తుంటే.. అమెరికా, బ్రిటన్​ ఇతర దేశాలు మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి.

అప్ర‌మ‌త్త‌మైన భార‌త్ 
India Alert It's Citizens In Ukraine: ఉక్రెయిన్​లో పరిస్థితులు వేడెక్కిన తరుణంలో.. భారతీయులు స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని పేర్కొంది. ప్ర‌ధానంగా ఉక్రెయిన్‌లో ఉండ‌డం త‌ప్ప‌నిస‌రికాని భార‌తీయులు వెంట‌నే భార‌త్ వ‌చ్చేయాల‌ని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. రేపు(బుధవారం) ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నేపథ్యంలో యూనిటీ డేగా శాంతి ర్యాలీలు నిర్వహించాలంటూ ఉక్రెయిన్​ అధ్యక్షుడు ఒక ప్రకటన సైతం వెలువరించడం గమనార్హం.

ఉక్రెయిన్​తో సహా మాజీ సోవియట్​ యూనియన్​ దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదంటూ పశ్చిమ దేశాలను రష్యా డిమాండ్​ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఉక్రెయిన్​ ఆక్రమణకు రష్యా సిద్ధపడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top