పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందినట్లు సమాచారం. క్వెట్టా సమీపంలో రైల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు. జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా ఆత్మాహుతి దాడి జరిగింది. రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా రైలులోని ఒక బోగీ పూర్తిగా ధ్వంసమైందని.. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, వాహనాలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
క్వెట్టా కంటోన్మెంట్ నుండి రైలులో ప్రయాణిస్తున్న పాకిస్థాన్ సైనిక సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. దాడి చేసింది తామేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ ఘటన స్థలంలో సహాయక చర్యలు, దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని.. ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించామని క్వెట్టా సివిల్ హాస్పిటల్ ప్రతినిధి తెలిపారు.


