విజయ్ సేతుపతి, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ట్రైన్’. నాజర్, యుగి సేతు, నరైన్, కేఎస్ రవికుమార్, సంపత్ రాజ్, ఐరా దయానంద్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా టీజర్ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఓ ట్రైన్ జర్నీలో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు, ఆ ట్రైన్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ప్రయాణికుల ఇబ్బందులు.. వంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు మిస్కిన్ సంగీతం అందించారు.


