ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌..వాటిని పునరుద్ధరించమని యూఎస్‌కి విజ‍్క్షప్తి! | Pakistan Urges US To Restore Military Financing Sales | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌..వాటిని పునరుద్ధరించమని యూఎస్‌కి విజ‍్క్షప్తి!

Apr 29 2023 9:28 AM | Updated on Apr 29 2023 12:16 PM

Pakistan Urges US To Restore Military Financing Sales - Sakshi

అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది పాక్‌ . గత కొంతకాలంగా ఇరు దేశాల సంబంధాలు..

అఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి పాక్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల సంబంధాలు సుదీర్ఘకాలం అనిశ్చితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు కొరతతో సతమవుతున్న పాక్‌ మిలటరీ ఫైనాన్సింగ్‌ సేల్స్‌ను పునరుద్ధరించాలని అమెరికాని కోరింది. వాస్తవానికి దీన్ని యూఎస్‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్‌లో జరిగిన సెమినార్‌లో అమెరికాకు చెందిన పాకిస్తాన్‌ రాయబారి మసూద్‌ ఖాన్‌ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన దానిని పునరుద్ధరించాలన్నారు. విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్‌, ఫారిన్‌​ మిలటరీ సేల్స్‌ను పునరుద్ధరించడం పాక్‌కి చాలా ముఖ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా యూఎస్‌ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎలిజబెత్‌ హూర్ట్స్‌ సమస్యత్మకంగా మారిన పాక్‌ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో సహాయం చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. ఐతే ముందు పాక్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌)తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఎలిజబెత్‌. పాక్‌ ఐఎంఎఫ్‌తో అంగీకరించిన కఠినమైన సంస్కరణలు అంత తేలికైనవి కాదన్నారు.

కానీ పాక్‌ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలన్న, మరింత అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పాక్‌కి ఈ చర్యలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు. అందువల్ల ఐఎంఎఫ్‌తో అంగీకరించిన సంస్కరణలను పాక్‌ ముందుగా అమలు చేయాలని యూఎస్‌ కోరింది. ఈ మేరకు పాక్‌ అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది. ఆ సమావేశంలో రాయబారి ఖాన్‌  రష్యా చమురు కోసం పాక్‌ తన మొదటి ఆర్డర్‌ ఇచ్చిందని కానీ యూఎస్‌తో సంప్రదించి వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖాన్‌ అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరత తీసుకురావడంలో పాక్‌ పోషించిన కీలక పాత గురించి మాట్లాడారు.

గత నాలుగు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘాన్‌లోని ప్రజలకు స్థిరత్వం చాలా అవసరం అని ఖాన్‌ పేర్కొన్నారు. అలాగే అఫ్ఘనిస్తాన్‌లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదంపై అమెరికా, చైనాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ రోజు అది పాక్‌, అఫ్ఘాన్‌లకు ముప్పుగా ఉండోచ్చు కానీ దీన్ని అదుపు చేయకపోతే మరింతగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని రాయబారి ఖాన్‌ పిలుపునిచ్చారు. 

(చదవండి: సూడాన్‌ నుంచి మరో 754 మంది రాక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement