Operation Kaveri: India Brings Home Another 754 Citizens From Sudan - Sakshi
Sakshi News home page

Operation Kaveri: సూడాన్‌ నుంచి మరో 754 మంది రాక

Apr 29 2023 6:23 AM | Updated on Apr 29 2023 11:15 AM

Operation Kaveri: India brings home another 754 citizens from Sudan - Sakshi

న్యూఢిల్లీ/కైరో: సూడాన్‌లో చిక్కుకుపోయిన మరో 754 మంది భారతీయులు ‘ఆపరేషన్‌ కావేరి’లో భాగంగా శుక్రవారం స్వదేశం చేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటిదాకా 1,360 మందిని తీసుకొచ్చినట్టు చెప్పారు.

వీరిలో 17 మంది తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ తెలిపింది. మరోవైపు సూడాన్‌లో హింస ఆగడం లేదు. 72 గంటల కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించి గంటలైనా కాకుండానే రాజధాని ఖార్టూమ్, ఒండుర్మన్, కఫౌరీల్లో పోరు తీవ్రమైంది.

Advertisement
 
Advertisement
Advertisement