భారత్‌పై పాక్‌ ఆర్మీ చీఫ్‌ అనుచిత వ్యాఖ్యలు | Pak Army Chief Asim Munir Over Action Comments On India | Sakshi
Sakshi News home page

భారత్‌పై పాక్‌ ఆర్మీ చీఫ్‌ అనుచిత వ్యాఖ్యలు

Jun 29 2025 10:57 AM | Updated on Jun 29 2025 12:37 PM

Pak Army Chief Asim Munir Over Action Comments On India

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసీం మునీర్ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్‌ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతోంది అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‌భారత్‌ గనుక మరోసారి పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసీం మునీర్‌ కరాచీలోని నేవల్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా మున్నీర్‌.. భారత్‌కు వ్యూహాత్మక ముందుచూపు కొరవడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్‌ కాపాడుతోంది. భారత్‌ దూకుడు వేళ పాక్‌ బలంగా స్పందించింది. ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్‌ పరిపక్వంగా ఆలోచన చేసింది. పాక్‌ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్‌ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. మరోసారి పాకిస్తాన్‌పై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’ అంటూ హెచ్చరించారు.

మరోవైపు.. అంతకుముందు కూడా మునీర్‌.. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌ నెట్‌వర్క్‌కు ఆప్ఘనిస్థాన్‌ వేదికగా మారిందన్నారు. అక్కడి వారితో పాకిస్తాన్‌పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే, పాక్‌.. ఆప్ఘనిస్తాన్‌తో స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. కానీ, ఆ దేశం భారత్‌ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ దాడులు పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు కీలకమైన ఎయిర్‌బేస్‌లపై భారత్‌ విరుచుకుపడింది. దీంతో, ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వీటిల్లో పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ కూడా ఉంది. ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బకు దాదాపు 8 కీలక మిలిటరీ  స్థావరాలు దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement