
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ మరోసారి భారత్పై నోరుపారేసుకున్నారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతోంది అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్ గనుక మరోసారి పాకిస్తాన్పై దాడి చేస్తే.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ కరాచీలోని నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా మున్నీర్.. భారత్కు వ్యూహాత్మక ముందుచూపు కొరవడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోంది. భారత్ దూకుడు వేళ పాక్ బలంగా స్పందించింది. ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచన చేసింది. పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. మరోసారి పాకిస్తాన్పై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’ అంటూ హెచ్చరించారు.
మరోవైపు.. అంతకుముందు కూడా మునీర్.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ నెట్వర్క్కు ఆప్ఘనిస్థాన్ వేదికగా మారిందన్నారు. అక్కడి వారితో పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే, పాక్.. ఆప్ఘనిస్తాన్తో స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. కానీ, ఆ దేశం భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడులు పాకిస్తాన్కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు కీలకమైన ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయి. వీటిల్లో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాదాపు 8 కీలక మిలిటరీ స్థావరాలు దెబ్బతిన్నాయి.
Pakistan Failed Marshal Asim Munir once again rants & pokes India, reaffirms his support for the continued terrorism against India in Jammu and Kashmir.
Also vowed continued political, moral, & diplomatic backing for proxy insurgency.#PakistanIsATerrorState #AsimMunir #Pakistan pic.twitter.com/6zHSA6gk8o— TIger NS (@TIgerNS3) June 29, 2025