సూడాన్‌ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్‌ కావేరి | Operation Kaveri launched to evacuate Indians from Sudan | Sakshi
Sakshi News home page

సూడాన్‌ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్‌ కావేరి

Apr 25 2023 5:52 AM | Updated on Apr 25 2023 5:52 AM

Operation Kaveri launched to evacuate Indians from Sudan - Sakshi

న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆపరేషన్‌ కావేరి’ని ప్రారంభించింది. ‘ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సూడాన్‌ పోర్టుకు చేరుకున్నారు. మరికొందరు వస్తున్నారు. వీరి కోసం అక్కడ ఓడలు, విమానాలను సిద్ధంగా ఉంచాం. సూడాన్‌లోని ప్రతి భారతీయుడికీ సాయంగా నిలుస్తాం’అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ట్వీట్‌ చేశారు.

వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నేవీకి చెందిన ఒక షిప్‌ను సూడాన్‌లోని ఒక పోర్టులో కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. మరోవైపు, సూడాన్‌లో ఉండిపోయిన తమ పౌరులు, దౌత్య సిబ్బంది తరలింపును పలు యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్‌ ప్రభుత్వం సూడాన్‌ నుంచి వెనక్కి తీసుకువచ్చిన 28 దేశాలకు చెందిన 388 మందిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది.   
సూడాన్‌ నౌకాశ్రయంలో భారతీయులు

Advertisement
 
Advertisement
Advertisement