
సాక్షి, హైదరాబాద్: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్-2025 పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో టాప్-8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. టాప్-8 మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ నిలిచాయి.
ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావంటూ అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం చెప్పిన వారికి నిర్వాహకులు అవకాశం ఇస్తున్నారు. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీలు మార్కులు వేస్తున్నారు.
మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..
అమెరికా ఖండం నుంచి మార్టినిక్
ఆఫ్రికా నుంచి ఇథియోపియా
యూరోప్ నుంచి పోలెండ్
ఆసియా నుంచి థాయిలాండ్