పెంపుడు పంది కోసం న్యాయపోరాటం
కనజోహరే: అమెరికాకు చెందిన ఫ్లాట్ అనే వ్యక్తి ఎల్లి అనే తన పెంపుడు పంది కోసం న్యాయస్థానం మెట్లెక్కాడు. స్థానిక అధికారులు పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని, అది ఫామ్ జంతువని, అందువల్ల దాన్ని ఫామ్హౌస్లో లేదా అడవిలో వదిలేయాలని ఫ్లాట్కు సూచించారు.
పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఫ్లాట్ అధికారులపై క్రిమినల్ కేసు వేశాడు. ఎల్లి తనను కష్ట సమయాల్లో ఓదార్చిందని, కుక్కల కన్నా ఎంతో తెలివైందని, దాన్ని వదులుకోనని వాదిస్తున్నాడు.
సంబంధిత వార్తలు