హోర్ముజ్లో కొన్ని నెలల పాటు విధులు నిర్వహించిన అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ థాయ్ ఓడరేవుకు చేరింది సుమారు 1,100 అడుగుల పొడవు కలిగిన ఈ నౌక గత నవంబర్లో శాన్ డియాగో నుంచి బయలుదేరినప్పటి ఇప్పటికీ ఎక్కడా పొంతన లేదు. నౌక అడుగు భాగం అంతటా తుప్పు పట్టి కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసి అక్కడివారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అది సహజమేనని నావికా దళ నిపుణులు అంటున్నారు. ఈ నౌక సుదీర్ఘంగా 286 రోజులు సముద్రంలోనే గడిపింది.
నిరంతరం 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు సముద్రంలో గడిపే నౌకలపై నీటి మట్టం వెంబడి తుప్పు పట్టడం సాధారణమే నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యంగా ప్రత్యక్ష యుద్ధ సమయంలో ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని మాజీ యుఎస్ నేవీ కెప్టెన్ కార్ల్ షూస్టర్చెప్పారు. సిబ్బందిని నీటి మట్టానికి కిందికి దించి.. తుప్పును తొలగించి.. తుప్పు నిరోధక ప్రైమర్ పూసి, చివరకు నావల్ గ్రే రంగు వేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ తుప్పు అంతటిని తొలగించడానికి సుమారు 30 రోజుల పడుతోంది. థాయ్లాండ్లో నౌక ఆగిన సమయంలో ఈ పనులలో కొంత భాగం ప్రారంభం కావచ్చన్నారు. ఈ నౌక బుధవారం బ్యాంకాక్కు దక్షిణంగా ఉన్న థాయ్ గల్ఫ్లోని లామ్ చబాంగ్ ఓడరేవుకు చేరుకుంది. ఈ పర్యటన కొన్ని రోజుల పాటు సాగనుంది. సుదీర్ఘమైన, కఠినమైన సముద్ర ప్రయాణం తర్వాత సిబ్బందికి ఇదే మొట్టమొదటి సరైన విశ్రాంతి సమయం.


