ప్రత్యేకాధికారి జయేశ్ రంజన్ కితాబు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు హైదరాబాద్ జిల్లాలో భేషుగ్గా ఉన్నాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ కితాబు ఇచ్చారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై కలెక్టరేట్లో ఆయన మంగళవారం కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి సమీక్షించారు. అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కదిరవన్ పళని, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


