సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నెట్వర్క్పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సప్లై చేస్తూ.. వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. 36 గంటల పాటు ఈ ఆపరేషన్ చేపట్టిన ఈగల్ ఫోర్స్.. 31 మంది క్యారియర్లు, 230 మంది వినియోగదారులను గుర్తించింది. ఒడిశాకు చెందిన పలువురు కీలక ముఠా సభ్యులను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
23 మంది బాధితులకు డి-అడిక్షన్ పూర్తి కాగా.. వారిని కోర్టు ముందు హాజరుపర్చగా.. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 64-A కింద పునరావాసం పొందిన వారికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. పాన్ షాపుల యాజమాన్యాలకు ఈగల్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇదీ చదవండి: హైదరాబాద్లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..


