మద్యం మత్తులో కుటుంబ కలహాలు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కుటుంబ కలహాలు

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

మద్యం మత్తులో కుటుంబ కలహాలు

యువకుడు ఆత్మహత్య

బాలానగర్‌: మద్యంమత్తులో భార్య, అత్తతో గొడవ పడిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్‌ సీఐ నర్సింహరాజు వివరాల ప్రకారం... హరిజన బస్తీకి చెందిన టేక్మాల్ల శ్రీకాంత్‌(28) ప్రైవేట్‌ ఉద్యోగి. భర్య యామిని, నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. మద్యానికి బానిసై తరచూ భార్య, కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, అత్తతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేయొద్దని అత్త మందలించడంతో వివాదం మరింత పెరిగింది. ఆ రాత్రి పక్కింటిలో నిద్రించిన భార్య, అత్త మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి చూడగా శ్రీకాంత్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement