సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్(ప్యాసింజర్ సర్వీసెస్, ప్యాసింజర్ మార్కెటింగ్)గా సేవలందించిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి డాక్టర్ బి.ఎస్.క్రిస్టోఫర్ అందించిన సేవలు చిరస్మరణీయమని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు కొనియాడారు. క్రిస్టోఫర్ ఉద్యోగ విరమణ సందర్భంగా మంగళవారం రైల్ నిలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఎంబీబీఎస్ వైద్యుడిగా సేవలందిస్తూనే ఆయన సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారని, ఆ తర్వాత ఐఆర్టీఎస్ అధికారిగా ఎంపికై దేశవ్యాప్తంగా పలు రైల్వే జోన్లలో సేవలందించారని వక్తలు ప్రశంసించారు.


