ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం

Jun 4 2023 12:12 PM | Updated on Jun 4 2023 12:16 PM

- - Sakshi

చిక్కడపల్లి: ట్యాంక్‌బండ్‌పై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట అలియాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు మనోజ్‌ కుమార్‌ (34) హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. శనివారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. సికింద్రాబాద్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌కు వెళ్తున్న వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అతివేగంతో వచ్చి మనోజ్‌ కుమార్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని దోమలగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మనోజ్‌కుమార్‌ మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ సయ్యద్‌ వసీం షాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ట్యాంక్‌బండ్‌పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. కేసు దర్యాప్తు దోమలగూడ ఇన్‌స్పెక్టర్‌ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌.ఐ.శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement