కరోనా కొత్త రూపం దాల్చింది.. జాగ్రత్త సుమా! | - | Sakshi
Sakshi News home page

కరోనా కొత్త రూపం దాల్చింది.. జాగ్రత్త సుమా!

Apr 16 2023 8:06 AM | Updated on Apr 16 2023 8:06 AM

మాట్లాడుతున్న మర్మ యోగి మన్‌ సిద్ధర్‌ - Sakshi

మాట్లాడుతున్న మర్మ యోగి మన్‌ సిద్ధర్‌

పంజగుట్ట: కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కొత్త వేరియంట్స్‌గా త్వరలోనే మరోమారు విజృంభించనుందని రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలియుగ సిద్ధ గురువు మర్మ యోగి మన్‌ సిద్ధర్‌ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓపెన్‌ సొసైటీ ఫర్‌ స్పిరిచువల్‌, సైన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అవేకనింగ్‌ (ఓప్ర) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కరోనా వస్తుందని గతంలో తాను ముందే చెప్పానని గుర్తుచేశారు. మహమ్మారి విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కలియుగ సిద్ధ గురువు మర్మ యోగి మన్‌ సిద్ధర్‌ హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement