చిట్టి చేతులతో మట్టి గణపతి తయారీ | - | Sakshi
Sakshi News home page

చిట్టి చేతులతో మట్టి గణపతి తయారీ

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్‌ గణేష్‌’ కార్యక్రమం ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. శుక్రవారం నగరంలోని 55 పాఠశాలలకు చెందిన 25 వేల మంది విద్యార్థులు ఏకకాలంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ ఘనత సాధించారు. గతంలో 8,750 మందితో ఉన్న రికార్డును అధిగమించడంతో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి ఎలియాజ్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై భావితరాలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్‌ అహ్మద్‌, బూర్ల రామాంజనేయులు, ఏపీటీఎస్‌ చైర్మన్‌ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సైకత వినాయకుడు, మట్టి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement