తొలి రోజే
స్వర్ణ–2 కార్యాలయం బయట నిరీక్షిస్తున్న వృద్ధులు
రెండేళ్లుగా పింఛను కోసం ఎదురుచూసి, ఎన్నో ఆశలతో కొత్త పింఛనుకు దరఖాస్తు చేసుకుందామని సోమవారం గ్రామ సచివాలయాలకు వెళ్లిన వారికి తొలి రోజే చుక్కలు కనిపించాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సేవ పోర్టల్ కొంత సేపు సర్వర్ డౌన్ అవ్వడం, మరికొంత సేపు నెమ్మదించడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజంతా కార్యాలయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రత్తిపాడులోని స్వర్ణ–1లో మూడు, స్వర్ణ–2లో రెండు, స్వర్ణ–3లో మూడు దరఖాస్తులు మాత్రమే సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ అయ్యాయంటే సర్వర్ ఎంత స్లోగా ఉందో చెప్పకనే తెలుస్తుంది. – ప్రత్తిపాడు


