అర్జీల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి

Jan 20 2026 7:47 AM | Updated on Jan 20 2026 7:47 AM

అర్జీల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి

అర్జీల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి

● వట్టిచెరుకూరు మండలం చదుల్లమూడికి చెంది న చిలుకూరి గోపినాథ్‌ అర్జీని సమర్పిస్తూ తన వ్యవసాయ భూమి దేవదాయ శాఖ భూమిగా నమోదైందని, విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. ● గుంటూరు తూర్పు మండలం కొత్తపేటకు చెందిన కుర్రాల వెంకటరమణ వినతిపత్రం సమర్పిస్తూ ఏపీ టిడ్కో గృహం కోసం చెక్కు నగర పాలక సంస్థకు అందజేశానని, ఇప్పటి వరకూ గృహం మంజూరు చేయలేదని తెలిపారు. ● తెనాలి మండలం పెదరావురు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ శివరామకృష్ణ అర్జీని సమర్పిస్తూ తన భూమి 22(ఏ)లో నమోదై ఉందని, దానిని తొలగించి న్యాయం చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పీజీఆర్‌ఎస్‌లో 195 అర్జీలు స్వీకరణ

లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లలో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలితో కలసి కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌లో వస్తున్న అర్జీలను పరిశీలించారు. మొత్తం 195 అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీల ను కలెక్టర్‌ పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్‌కు నాలు గు కౌంటర్‌లు ఏర్పాటుచేశారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన కొన్ని అర్జీల వివరాలు ఈవిధంగా ఉన్నాయి..

డీఆర్వో శ్రీనివాసరావు, డెప్యూటీ కలెక్టర్‌లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయికుమార్‌, డీఆర్‌డీఏ పీడీ వి.విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి.సత్యనారాయణ, జిల్లా ఉపా ధి కల్పన అధికారి డి.దుర్గాభాయి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement