త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం

Jan 14 2026 9:58 AM | Updated on Jan 14 2026 9:58 AM

త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల న

త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల న

త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం

తెనాలిటౌన్‌: త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలిపారు. రూరల్‌ మండలం బుర్రిపాలెం గ్రామంలో మంగళవారం ఆయన అధికారులతో కలసి పర్యటించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చొరవతో సెంట్రల్‌ స్కీమ్‌ ద్వారా సొంత ఇంటి స్థలం కలిగిన 91 మంది పేదలకు త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం జగ్గడిగుంటపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ లే అవుట్‌ను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు పరిశీలించి కాంట్రాక్టర్‌లతో ముచ్చటించారు. నిర్మాణం ఏ దశలో ఉంది, లబ్ధిదారులకు మేలు కలిగేలా నిర్మాణాలు జరుగుతున్నది లేనిది వాకబు చేశారు. నాణ్యత ప్రమాణాలకు లోటు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. ఆయన వెంట చీఫ్‌ ఇంజనీర్‌ జయరామాచారి, ఎస్‌ఈ వేణుగోపాల్‌, జిల్లా హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, తెనాలి హౌసింగ్‌ ఈఈ భాస్కర్‌, ఏఈ బాలాజీ, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement