గుంటూరు వెస్ట్ : దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్న సాయుధ దళాలకు ఆర్థిక చేయూతనందించడం అభినందనీయమని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2024కు సంబంధించి గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక బృందాల నుంచి సేకరించిన రూ.2,05,197 చెక్కును మెప్మా పీడీ విజయలక్ష్మి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చేతుల మీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణ షీలాకు అందజేశారు. ఈ సందర్బంగా మెప్మా విభాగ కృషిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి