బాధ్యతను గుర్తుచేసేలా.. అబ్బురపరుస్తున్న వన్యప్రాణుల చిత్రాలు..! | Message Images Flyover Pillars Remind People Of Wildlife Conservation Begumpet Hyderabad | Sakshi
Sakshi News home page

బాధ్యతను గుర్తుచేసేలా.. అబ్బురపరుస్తున్నవన్యప్రాణుల చిత్రాలు..!

May 30 2025 9:41 AM | Updated on May 30 2025 10:31 AM

Message images remind people of wildlife conservation Begumpet Hyderabad

వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్రం బేగంపేట ప్రకాశ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ పిల్లర్స్‌ను వన్యప్రాణుల చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను వన్య ప్రాణుల బొమ్మలు కట్టిపడేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడే రీతిలో చిత్రకారులు గీసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

చిరుతలు, పులులు, ఏనుగులు, ఎగులుబంట్లు, జాతీయ పక్షి నెమళ్లు, జింకలు, సింహాలు.. ఇలా రకరకాల వన్యప్రాణుల చిత్రాలు చూస్తే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను అటుగా వెళ్లే ప్రయాణికులకు గుర్తుచేస్తున్నాయి. భారత జులాజికల్‌ సర్వే(జెడ్‌ఎస్‌ఐ) ప్రకారం దేశంలో మొత్తం 89 వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. 

వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి వన్య ప్రాణులను సంరక్షించుకోవడం ద్వారా అటవీ సంపదను కాపాడిన వారమవుతామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పర్యావరణ వేత్తలు నిత్యం పలు రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నారు. 

ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లైఓవర్ల సుందరీకరణలో భాగంగా బేగంపేట ప్రకాష్‌నగర్‌(ఎయిర్‌పోర్ట్‌ ఎదురుగా) ఫ్లైఓవర్‌ పిల్లర్స్‌కు వేసిన చిత్రాలను చూస్తే అద్భుతమనిపిస్తోంది. సందేశాత్మక థీమ్‌తో అబ్బురపడేలా వేసిన చిత్రాలు ఒక దానికి మించి మరొకటి ఉంది.  

(చదవండి: డీఎన్‌డీ మోడ్‌..! ఈజీగా నోటిఫికేషన్స్‌, ఫోన్‌కాల్స్‌ మ్యూట్‌ చెయ్యొచ్చు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement