‘‘గ్రేట్‌ ఎలిఫెంట్‌ మైగ్రేషన్‌ ’’, నూయార్క్‌కు చేరుకున్న గజరాజులు | Great Elephant Migration reaches New York to spread the message of coexistence | Sakshi
Sakshi News home page

‘‘గ్రేట్‌ ఎలిఫెంట్‌ మైగ్రేషన్‌ ’’, నూయార్క్‌కు చేరుకున్న గజరాజులు

Sep 7 2024 12:17 PM | Updated on Sep 8 2024 7:59 AM

Great Elephant Migration reaches New York to spread the message of coexistence

భారతీయ కళాకారులు రూపొందించిన అపురూపమైన ‘‘గ్రేట్‌ ఎలిఫెంట్‌ మైగ్రేషన్‌ ’’ 100 ఏనుగుల కళాశిల్పాలు   న్యూయార్క్‌ చేరుకున్నాయి.  ప్రతి ఏనుగును తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్‌ రిజర్వ్‌ నుండి 200 మంది దేశీయ కళాకారులతో కూడిన ది కోఎక్సిస్టెన్స్‌ కలెక్టివ్‌ రూపొందించింది. ఈ అద్భుతమైన  కళాఖండాల త తయారీకి ఐదేళ్ళు పట్టింది.  ఇవి అమెరికా అంతా పర్యటించి  సహజీవనం సందేశాన్ని వ్యాప్తి చేయనున్నాయి. ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేశారు.

తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌కు చెందిన స్థానిక గిరిజన కళాకారులచే  లాంటానా జాతికి చెందిన కలుపు మొక్కల చెక్క నుంచి ఈ కళాకృతులను రూపొందించారు.  ‘‘మానవ-వన్యప్రాణుల సహజీవన ప్రాజెక్టుల’’ కోసం మిలియన్ల డాలర్లను సేకరించాలనే లక్ష్యంతోపాటు, ‘‘భూమి, నదులు, ఆకాశం మరియు మహాసముద్రాల మీదుగా అద్భుతమైన ప్రయాణాలు చేసే వలస జంతువులను రక్షించడం’’

ఈ శిల్పాలను ఎవరు రూపొందించారు?
బెట్టకురుంబ, పనియా, కట్టునాయకన్‌ , సోలిగ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు కలిసి ప్రతి జీవం-వంటి, శరీర నిర్మాణపరంగా  ఎలాంటి తేడా లేకుండా  క్లిష్టమైన ఏనుగు శిల్పాలను రూపొందించారు. అక్టోబర్‌ 20 వరకు న్యూయార్క్‌ నగరంలో  తర్వాత  ఆర్ట్‌ బాసెల్‌ మయామికి వెళతాయి. లాస్‌ ఏంజిల్స్‌లో, బ్లాక్‌ఫీట్‌ నేషన్‌ మధ్య మోంటానాలోని బ్రౌనింగ్‌లోని బఫెలో ,పరిరక్షణ బృందం హ్యూస్టన్‌ , గ్లేసియర్‌ నేషనల్‌ పార్క్‌, ఈ శిల్పాలు 13 నెలల పాటు అమెరికా  వివిధ  ప్రాంతాలలో కొలువుదీరతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement