ఆన్‌లైన్‌ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్‌ఈ' | First Online Financial Literacy Platform At Mercure Hotel Hyderabad | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్‌ఈ'

Jun 13 2025 11:33 AM | Updated on Jun 13 2025 11:33 AM

First  Online Financial Literacy Platform At Mercure Hotel Hyderabad

ఆర్థిక అక్షరాస్యత కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఈ తరానికి ఇదొక తప్పనిసరి అవసరమని ఫిన్‌ఈ వ్యవస్థాపకురాలు బ్లెసిడా బెన్నీ అన్నారు. విద్యార్థులు మొదలు, వర్కింగ్‌ ఫ్రొఫెషనల్స్‌ వరకూ ఆర్థిక విద్య (ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌)ను చేరువ చేయడానికి ఫిన్‌ఈ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ఆర్థిక అక్షరాస్యత వేదిక ఫిన్‌వర్సిటీని ప్రారంభించామన్నారు. నగరంలోని మెర్క్యూర్‌ హోటల్‌ వేదికగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విప్లవాత్మక  ఫిన్‌వర్సిటీని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవానికి మాజీ ఐఏఎస్‌ అధికారి జగదీశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

నేటి ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ప్రధానమైన అంశమని, మనం మరింత విజ్ఞానం, సాధికారత కలిగిన జనాభా కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆర్థిక అవగాహనను ప్రోత్సహించడం ముఖ్యమని తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్తును నిర్మించడమే ఈ వర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం బ్లెసిడా బెన్నీ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. యువతతో పాటు నిపుణులలో ఆర్థిక అక్షరాస్యతలో గణనీయమైన అంతరం ఉందని, ఈ క్లిష్టమైన అంతరాన్ని తగ్గించే ప్రణాళికలు తమ లక్ష్యమని అన్నారు. 

ఫిన్‌వర్సిటీతో రానున్న రెండేళ్లలో 20 లక్షల మందిని మార్చుతూ.. ప్రపంచ ఆర్థిక నైపుణ్యాలతో సాధికారత కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. మాజీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్‌ఎస్‌వి బద్రీనాథ్, ఫిన్‌ఈ డైరెక్టర్‌ నులకజోడు మధు వినయ్, నటులు శ్రీ తేజ్, అభిలాష్‌ శంకర, ప్రఖ్యాత గాయకుడు లక్ష నాయుడు, జబర్దస్త్‌ ఆర్టిస్టులు తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. 

(చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్‌ వరల్డ్‌ 2025లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement