
హార్స్ షోలో సత్తా చాటిన అత్యంత పిన్న వయస్కుడైన ఈక్వెస్టియన్ రైడర్గా నగరానికి చెందిన మాస్టర్ ధృవ నిలిచాడు. ఈక్వెస్ట్రియన్ అకాడమీ ఆధ్వర్యంలో శంకర్పల్లిలోని నాసర్ పోలో ఆవరణలో అండర్–10, 12, 14, 16, అదే విధంగా 45–125 సెంటీమీటర్ల ఓపెన్ విభాగాల్లో దాదాపు 650 మంది రైడర్లకు పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రెస్సేజ్ విభాగంతో పాటు ట్రోట్ సీహెచ్–2 వంటి విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఈ పోటీల్లో పదేళ్ల బాలుడు మాస్టర్ ధృవ 3 బంగారు, 1 రజితం, 1 కాంస్య పతకాలతో ప్రథమ బహుమతులు సాధించాడు.
ఈ సందర్భంగా ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు ధృవ. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి ఆరేళ్ల వయసు నుంచే గుర్రపుస్వారీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
(చదవండి: ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..)