చైనీస్ అంతరిక్ష శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సాధించారు. చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో తొలిసారిగా భూమికి 400 కిలోమీటర్లకు పైగా దూరంలోనున్న కక్ష్యలో వరిపంట పండించారు. ఈ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న ‘షెంఝౌ–23 మిషన్’ బృందం శాస్త్రవేత్తలు గడచిన నాలుగేళ్లలో అంతరిక్షంలోనే వరి విత్తనాలను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో అభివృద్ధి చేసిన విత్తనాలతో ఇటీవల పూర్తిస్థాయిలో వరిపంట పండించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) సహా వివిధ అంతరిక్ష కేంద్రాలలో పనిచేసే శాస్త్రవేత్తల కోసం భూమి నుంచి ఆహార పదార్థాలు సహా నిత్యావసరాలను సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భూమి పైనుంచి వచ్చే సరఫరాలపై ఆధారపడకుండా, అంతరిక్షంలోనే ఆహారపంటలు పండించే దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అంతరిక్షంలో ఆహారధాన్యాన్ని పండించడంలో చైనీస్ శాస్త్రవేత్తలు తొలి విజయాన్ని సాధించారు.


