భీమవరం: ప్రజా కళలను కళాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు తీవ్రంగా విమర్శించారు. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. ప్రజా నాట్యమండలి ఎంతోకాలంగా ప్రజల కష్టసుఖాలను పాటలుగా వీధి నాటకాలుగా తయారుచేసి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రభుత్వాలు కళాకారులను పట్టించుకోవడంలేదని గుర్తింపు కార్డులు, ఇతర ప్రోత్సాహకాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి చైతన్య ప్రసాద్ అధ్యక్షత వహించగా గోదావరి సాహితీ స్రవంతి కన్వీనర్ శ్రీనివాసరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి వాసుదేవరావు, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వల్లి తదితరులు పాల్గొన్నారు.


