పంద్రాగస్టు పండగను పురస్కరించుకుని నిడదవోలు పట్టణం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం 400 మీటర్ల జాతీయ జెండాతో స్థానిక ఎస్వీడీ మహిళా ప్రభుత్వ కళాశాల నుంచి ఐ లవ్ నిడదవోలు జంక్షన్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ సాగింది. మంత్రి కందుల దుర్గేష్ ర్యాలీని ప్రారంభించగా, ఏబీవీపీ కన్వీనర్ సత్యసాయి, జిల్లా కన్వీనర్ లలిత్, భాగ్ కన్వీనర్ మోక్ష, పట్టణ కన్వీనర్ లక్కి విద్యార్థులు, యువత, నాయకులు పాల్గొన్నారు.
– నిడదవోలు


