ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరద నీటితో గోదావరి ఉరుకులు, పరుగులు పెడుతోంది. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వాన నీటితో శుక్రవారం ఉధృతి పెరిగింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీకి నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. అలాగే రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, కోటిలింగాల ఘాట్ తదితర ప్రాంతాల్లో మెట్లను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి నీటి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు.
– రాజమహేంద్రవరం సిటీ
ముంపునకు గురైన కోటిలింగాలరేవు
హేవలాక్ బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతి


