ఆ అరటి గెల అబ్బురపరుస్తోంది. పెదపళ్లలో రైతు గొడితి వెంకన్న ఇంటి పెరట్లో బూసావళీ రకానికి చెందిన అరటి మొక్కకు సాధారణ స్థాయిలో కంటే అధికంగా 16 అత్తాలు ఉన్నాయి. ఐదున్నర అడుగులకు పైగా ఉన్న ఈ గెలకు ఒక్కొక్క అత్తంలో 30 నుంచి 35 వరకూ అరటి పండ్లు కాశాయి. ఇలా మొ త్తం 500 పైగా పండ్లు ఉన్నా యి. టిష్యూ కల్చర్ సెంటర్ నుంచి ఈ జాతి మొక్కను తీసుకొచ్చి పెరట్లో నాటామ ని వెంకన్న తెలిపారు. దీని పై కొత్తపేట డివిజన్ ఉద్యా నశాఖాధికారి జి.కోటేశ్వరరావును వివరణ కోరగా టిష్యూ కల్చర్ ద్వారా సేకరించిన మొక్కలో తొలుత అధికంగా పండ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. క్రమేపీ గెల స్వభావం, పరిమాణం తగ్గుతుందన్నారు. – ఆలమూరు


