ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి ప్రొవిజనల్ లిస్టు విడుదల కాగా, వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. తుది జాబితా విడుదల కావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎందుకో ఈసారి జాప్యం జరిగింది. 2026–27 సంవత్సరానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ లోపు తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
– కాండ్రేగుల వెంకటేశ్వరరావు,
డీవైఈఓ, కొత్తపేట
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ఎన్ఎంఎంఎస్కు అర్హత సాధించిన విద్యార్థుల తుది జాబితా గత ఏడాది జూన్ నెల మొదటి వారంలో విడుదల చేశారు. ఈసారి జాప్యం జరగడంతో ప్రొవిజనల్ లిస్టులో ఉన్న విద్యార్థులు ఫైనల్ లిస్టు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తమ విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహించాలి.
– దీపాటి సురేష్ బాబు,
జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ


