తోబుట్టువులతో మేటర్‌ చెప్పిన యువతి.. ప్రియుడు మాట దాటవేస్తుండటంతో..

Young Woman Commits Suicide Over Love Problem In Shamirpet - Sakshi

సాక్షి, శామీర్‌పేట్‌: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మ జ్యోతి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రమైన శామీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తన అక్కచెల్లెళ్లతో చెప్పింది.

ఇటీవల జ్యోతిని ప్రేమించిన వ్యక్తి పెళ్లి విషయం రాగానే మాట దాటవేస్తున్నాడని బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి వేదవతి ఇంటికి వచ్చే సరికి ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. 
చదవండి: వివాహేతర సంబంధం: మైనర్‌ బాలుడే నిందితుడు

వివాహేతర సంబంధం.. యువకుడిపై హత్యాయత్నం 
ఘట్‌కేసర్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... అంబేడ్కర్‌నగర్‌ జవహర్‌నగర్‌కు చెందిన ఎడ్ల దేవ(30) కూలీ. చక్రిపురం కుషాయిగూడకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న వివాహిత సోదరుడు నవీన్‌ అతడిని చంపాలని రాంపల్లికి తీసుకొచ్చి మద్యం సేవించారు.
చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ

అనంతరం ఘట్‌కేసర్‌–ఘనాపూర్‌ సర్వీస్‌ రోడ్డు చెట్లపొదల్లో మరొక వ్యక్తితో కలిసి కత్తితో గొంతు కోశారు. వెంటనే దేవ వారి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తగా ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్సత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top