పురుగుల మందు తాగిన ప్రేమజంట మృతి

Young Duo Girl And Boy Eliminates Themselves In Vikarabad District - Sakshi

సాక్షి, వికారాబాద్‌: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కీర్తన (16), బాలరాజ్ (22) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలిసిపోయింది. దీంతో భయాందోళన చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. కీర్తన అక్కడిక్కడే మృతి చెందగా.. హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో  బాల్‌రాజ్‌ ప్రాణాలు విడిచాడు.(చదవండి: ఆన్‌లైన్‌లో అప్పులు.. యువతి ఆత్మహత్య )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top