పేస్టుగా చేసి బంగారం దాచి.. | Woman Passenger Held Smuggled Gold Worth Over Rs 86 Lakh In Hyderabad | Sakshi
Sakshi News home page

పేస్టుగా చేసి బంగారం దాచి..

Jun 17 2022 2:42 AM | Updated on Jun 17 2022 2:42 AM

Woman Passenger Held Smuggled Gold Worth Over Rs 86 Lakh In Hyderabad - Sakshi

శంషాబాద్‌ (హైదరాబాద్‌): బూట్‌ సాక్సుల్లో కొంత.. మలద్వారంలో మరికొంత బంగారం దాచి విమానం దిగిన ఒక  ప్రయాణికురాలు కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడింది. వివరాలివి. శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున జె9403 కువైట్‌ విమానం దిగిన ప్రయాణికురాలిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఆమె బూటు సాక్సుల్లో నల్లటి కవర్లలో దాచి ఉంచిన బంగారం బయటపడింది.

మహిళను మరింత విచారించగా.. నల్లటి ఉండల మాదిరిగా చేసి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చిన బంగారం పేస్టు గురించి ఆమె వివరించింది. దీంతో ఆ మహిళకు వైద్యులతో శస్త్రచికిత్స చేయించి బంగారాన్ని బయటికి తీయించారు. మొత్తం ఆమె నుంచి 1.646 కేజీల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.86 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement